ఆస్ట్రియాలోని గ్రాజ్ పట్టణంలోని ఓ పాఠశాలలో మంగళవారం కొందరు దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.