సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పేలుడు ఘటనలో కార్మికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. అయితే శరీర అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో వెంట్రుకలు, మాంసం ముద్దలు, ఎముకలు, రక్తం మరకలతో ఉన్న రాళ్లు, కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి. ఇప్పటివరకు 70కి పైగా శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా.. మరో 9 మంది కార్మికుల జాడ తెలియరాలేదు.