ఐపీఎల్ 2025 మ్యాచ్లను బీసీసీఐ రద్దు చేసింది. భారత్-పాక్ యుద్ధ వాతావరణం, ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ల కోసం విదేశాల నుంచి ఎంతోమంది క్రికెటర్లు ఇండియాకు వచ్చారు. అయితే ఈ మ్యాచ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే అది పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉంది. అందుకని విదేశీ ప్లేయర్ల భద్రత అనేది సవాల్గా మారింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్ మ్యాచులను రద్దు చేసింది