సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. సామాన్యులను మట్టుపెట్టేందుకు డ్రోన్లతో దాడికి చేసి, పలు ఇళ్లను ధ్వంసం చేస్తోంది. పాకిస్థాన్తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని ఎయిర్పోర్టులకు హైఅలర్ట్ ప్రకటించింది. ప్రయాణికులు కూడా విమానాశ్రయాలకు 3 గంటల ముందే చేరుకోవాలంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.