కువైట్లోని సెవెంత్ రింగ్ రోడ్లో మంగళవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల మినీబస్సును కువైట్ వాసి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రవాస భారతీయులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మరణించిన భారతీయులు బీహార్, తమిళనాడుకు చెందిన వారని సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.