తన భర్త జానీ మాస్టర్పై మహిళా కొరియోగ్రాఫర్ మనసు పడిందని ఆయేషా ఆరోపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'ఆరేళ్లుగా ఆమెపై నా భర్త లైంగిక వేధింపులకు పాల్పడితే ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటీ?. రెండేళ్లుగా ఆమెకు జానీతో కాంటాక్టే లేదు. అయినా ఆమెకు డాన్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించాం. ఆమె చెల్లెలి చదువు కోసం జానీ సహాయం చేశారు' అని ఆయేషా తెలిపారు.