స్వదేశంలోనే పాకిస్థాన్కు షాక్ తగిలింది. దశాబ్దాలుగా ఆ దేశానికి కొరకరాని కొయ్యగా మారిన బలోచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం.. తాజా ఉద్రిక్తతల వేళ మరింత తీవ్రమైంది. బలోచిస్థాన్ ప్రావిన్స్లో గల కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించింది. అంతేగాక, బలోచిస్థాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపింది.