TG: ఖమ్మం జిల్లాలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ యుద్ధం మొదలు పెడితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శాంతి కోరుకున్నారు కాబట్టే పాకిస్తాన్ మిగిలి ఉందన్నారు. అలాగే ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే ఆడబిడ్డలతోనే పాకిస్తాన్కు బుద్ధి చెప్పారన్నారు. వారు చంపుతుంటే చూస్తుండాలా? కాళ్లకు పారాణి ఆరకముందే సింధూరం తీసేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.