AP: తుపాకీతో కాల్చుకొని తణుకు రూరల్ ఎస్ఐ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటు చేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకోవడంతో మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.