సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలకు రూ. 3, 58, 29, 000 నిధులు విడుదల అయినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం తెలిపారు. జిల్లాలోని 1, 213 మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు నియమించుకున్న పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలకు సంబంధించిన రూ. 3, 58, 29, 000 విడుదల చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను ఏఏపీసీ ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.