అక్బర్ పేట భూంపల్లి నూతన తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని మంగళవారం మండల ఎంఈఓ అంజాగౌడ్ శాలువాతో సన్మానించారు. అనంతరం తహశీల్దార్ ఎంఈఓ ని మండల పాఠశాలలోని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని ఎంఈఓ ను కోరారు.