తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మొండి వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందట రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. బుధవారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.