కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నంగునూరు మండల అధ్యక్షుడు దేవులపల్లి రాజమౌళి డిమాండ్ చేశారు. బుధవారం కార్మికుల కోర్కెల దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో తహాశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తూ బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడంలేదని విమర్శించారు.