దుబ్బాక మున్సిపాలిటీలోని వార్డులలో వార్డ్ అధికారులు తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, విధుల్లో వార్డ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని దుబ్బాక మున్సిపాల్ కమిషనర్ కళ్యాణం రమేష్ కుమార్ తెలిపారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో 15 మంది వార్డ్ అధికారులు, మున్సిపాలిటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.