విద్యార్థులు ఉన్నత లక్ష్యం వైపుగా అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందజేసారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశ నుండే ఉన్నత లక్ష్యం వైపుగా అడుగులు వేయాలన్నారు. విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.