గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని విద్యార్థులు గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకొని ఉన్నతంగా ఎదగాలని గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా అన్నారు. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని రిమ్మనగూడ జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.