గజ్వేల్: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గోపాలమిత్ర సభ్యులు

70చూసినవారు
గజ్వేల్: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గోపాలమిత్ర సభ్యులు
సిద్దిపేట మండలానికి చెందిన గోపాల మిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్