సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో లోక శాంతి కోసం గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామ, శివ లిఖిత మహాయజ్ఞం శుక్రవారం కృష్ణాలయంలోని రామాలయం వద్ద రెండు గంటల పాటు రామనామ స్మరణ మధ్య రామ, శివ నామాలను లిఖించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో రాసిన రామ, శివ లిఖిత మహాయజ్ఞాన్ని శృంగేరి పీఠానికి అందజేస్తామని తెలిపారు.