వర్గల్ మండలం శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన దేవోల్ల పోచయ్య(70) శుక్రవారం బంధువుల ఇంట్లో పెళ్లికోసం తన బైక్ పై బయల్దేరాడు. మాదారం శివారుకు రాగానే బైక్ అదుపుతప్పి పోచయ్య కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.