మహిళలు, గర్భవతులు అందుబాటులో ఉండే పోషకవిలువలు గల ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లు తీసుకోవాలని, వాటితోనే ఆరోగ్యం అని ఐసీడిఎస్ సూపర్ వైజర్ శ్రీ లక్ష్మి అన్నారు. బుధవారం పోషణ పక్షోత్వాలలో భాగంగా గజ్వేల్ పట్టణం లోని ఆర్ అండ్ ఆర్ కాలనీ వెములఘట్ లో పౌష్ఠికాహరం పై, చిరుధాన్యాల పై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.