అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగి నేటికీ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని రామకోటి భక్త సమాజ వ్యవస్థాపకులు రామకోటి రామరాజు ఆవాలతో బాల రాముని అద్భుత చిత్రాన్ని రూపొందించి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అయోధ్య రామున్ని భక్తిశ్రద్ధలతో కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. రామనామం ఒక్కటే శాశ్వతమని రామకోటి నామాన్ని లిఖించి ధరించాలని ఆయన పిలుపునిచ్చారు.