గజ్వేల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి రూ. 7వేల జరిమానా

74చూసినవారు
గజ్వేల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి రూ. 7వేల జరిమానా
మద్యం తాగి పట్టుబడిన పలువురు వాహనదారులకు గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వాతి గురువారం జరిమానా విధించారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సీఐ మురళీ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ఆరుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆరుగురికి మొత్తంగా రూ. 7, 000 జరిమానా, ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్