జగదేవ్ పూర్: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యతమైన విద్య

61చూసినవారు
జగదేవ్ పూర్: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యతమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సరోజ పేర్కొన్నారు. జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామాల్లో బడిబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యను అభ్యసించాలని వారి తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్