సీజనల్ వ్యాధుల వల్ల ప్రబలే అంటూ వ్యాధుల పైన క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. గ్రామంలో జ్వర పీడితులకు తక్షణమే రక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని, అవసరం ఉన్న సమయంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని యూపీహెచ్ సి వర్గల్ ని అయన ఆకస్మిక సందర్శనలో భాగంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు.