సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో రామ నామమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ రామ నామాన్ని లిఖించాలని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. శనివారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల విశిష్టత, వాటి పవిత్రత తెలియజెసి హనుమాన్ స్వాములకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతు రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందన్నారు.