హెచ్ ఎండీ ఎ పరిధి జిల్లాలో గల మర్కుక్, ములుగు, వర్గల్ మండలాల్లో గల చెరువులు, కుంటలకు సంబంధించిన భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఆయా మండల రెవెన్యూ, నీటిపారుదల, భూ-సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.