నంగునూరు మండలంలోని మోయతుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా తరలించి డంపుల్ గా ఏర్పాటు చేసిన వాటిని గుర్తించి స్వాధీన పరుచుకున్నట్లు రాజగోపాల్ పేట ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. వాగు నుండి తరలించిన వివిధ వ్యక్తులు నంగునూరు గ్రామ సమీపంలోని రామాలయం బండ చుట్టూ, బండమీద, ప్రభుత్వ, ప్రైవేటు, స్థలాల్లో 18 ఇసుక డంపులను సుమారు 190 ట్రాక్టర్ ట్రిప్పులు గా గుర్తించినట్లు తెలిపారు.