
ఇవాళ స్వగ్రామానికి వీర జవాన్ మురళి నాయక్ పార్దివదేహం
పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ పార్దివదేహం శనివారం స్వగ్రామానికి చేరనుంది. రాత్రి 7 గంటలకు గుమ్మయగారిపల్లి గ్రామం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు మురళి భౌతికకాయం ఇంటికి చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. మురళి చివరి చూపు కోసం ప్రజలు భారీగా తరలిరానున్నారు. మురళి నాయక్ స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల(M) కల్లితండా.