షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని ఎంఎస్ సీ రాష్ట్ర నాయకులు మైస రాములు పేర్కొన్నారు. గురువారం ఎస్సి వర్గీకరణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందక్రిష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.