
పాక్కు అమెరికా సూచన
భారత్ - పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పాక్కు అమెరికా పలు సూచనలు చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పాక్కు రూబియో సూచించినట్లు పలు ఇంటర్ నేషనల్ మీడియాలు రాసుకొస్తున్నాయి. అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని.. యుద్ధం ముగించేలా చూడాలని సూచించారు.