బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ ప్రస్థానంలో వరంగల్ సభ అత్యంత ప్రతిష్టాత్మకమని శాసనమండలి సభ్యులు డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి అన్నారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మందికి తగ్గకుండా రజతోత్సవ సభకు తరలి రావాలని ఆకాంక్షించారు.