నీళ్లు రాకపోవడంతో రోడ్డు ఎక్కిన మహిళలు

51చూసినవారు
నీళ్లు రాకపోవడంతో రోడ్డు ఎక్కిన మహిళలు
కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో గత పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిచిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కాలిబిందెలతో నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న బిజెపి మండల ఉపాధ్యక్షులు మద్దికుంట కర్ణాకర్ మహిళలతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు చేపట్టి నీళ్లను సరఫరా చేయాలని అధికారులను ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్