సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలో శనివారం రోజు ఉదయం హనుమాన్ దీక్ష స్వాములు అంగరంగ వైభవంగా గాంధీనగర్ గ్రామంలోని వీధుల్లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ విగ్రహంతో భక్తిశ్రద్ధలతో గాంధీనగర్ గ్రామంలోని వీధుల్లో శోభాయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.