హుస్నాబాద్: ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బత్తుల చంద్రమౌళి బుధవారం మాట్లాడుతూ ఫిబ్రవరి 7న చేపట్టాల్సిన వేల గొంతులు - లక్షల డప్పుల సాంసృతిక మహాప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ప్రకటించారన్నారు. ఈ విషయాన్ని మాదిగ మరియు ఉప కులాల ప్రజలు గమనించాలని, నూతన తేదీని మళ్ళీ ప్రకటించడం జరుగుతుందన్నారు.