ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన పాల్వంచకి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం నివాళులర్పించారు. వారితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సినవి అన్ని అందిస్తామని హామీనిచ్చారు.