అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురు గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. అయితే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే ఆరబోసిన పంట వర్షానికి తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.