సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో లింగాల భాను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ ఇంజన్ మధ్యలో భాను శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. తల భాగం మాత్రమే బయటికి కనబడింది. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ని పక్కకు తీసి భాను మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.