వడగళ్ల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని, ఎకరాకు రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులుతండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించారు. నష్టంపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారన్నారు.