లోన్ ఆప్ వేధింపులతో యువకుడి మృతి

71చూసినవారు
లోన్ ఆప్ వేధింపులతో యువకుడి మృతి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల అనిల్ అనే యువకుడు లోన్ యాప్ ల వేధింపులు భరించలేక శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా హాస్పటల్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్