మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆస్తి కోసం కుమారుడు నాగరాజు తన తండ్రి వడ్ల దశరథ్ (52)ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకోని, దర్యాప్తు చేపట్టారు.