రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మెదక్ మండలం మంబోజి పల్లి వద్ద కారు ఆటో ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. అంసాని పల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ (45) ఆటో నడిపిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొనడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మరణించాడు. మెదక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్