కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు నమ్మేటట్లు లేరని, అందుకే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో చిలిపిచెడ్ మండలం రాందాస్ గూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.