బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డు మార్గంలో రైస్ మిల్లు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు వెంటనే బీరంగూడ కమాన్ పనేషియా మెరిడియన్ ఆసుపత్రికి తరలించారు.