సంగారెడ్డి జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో పెళ్లి కొడుకు మేనకోడలు మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. న్యాల్కల్ మండలం ఖలీలపూర్ గ్రామానికి చెందిన పూర్ణచందర్ పెళ్లి శుక్రవారం జరగనుంది. స్థానిక పరిసరాలు తడిగా మారడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ సపోర్ట్ వైర్కు కరెంట్ సరఫరా అయింది. ఈ క్రమంలో పక్క నుంచి వెళ్లిన పెళ్లి కొడుకు అక్క కూతురు భాగ్యలక్ష్మి కరెంట్ షాక్ కై గురై మృతి చెందింది.