పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సిగాచీ పరిశ్రమలో శిథిలాల తొలగింపు ఆరో రోజు కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది భవన శిథిలాలు తొలగిస్తున్నారు. మరోవైపు పటాన్చెరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ చౌదరి శనివారం మృతి చెందారు. దీంతో భారీ పేలుడులో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 40కి పెరిగింది.