గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైకాలజీ క్లాసులు బ్రహ్మకుమారి సంస్థకు అప్పగించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో గురుకుల విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లలితా రాణి పాల్గొన్నారు.