నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకంగా మారుతాయని టూటౌన్ సీఐ ఉపేందర్ అన్నారు. గురువారం సిద్ధిపేటలోని బృందావన కాలనీలో సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల దొంగతనాలతో పాటుగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంటాయన్నారు. సీసీ కెమెరాలు కాలనీ ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ రక్షణగా 24 గంటలు నిలుస్తాయన్నారు.