దౌల్తాబాద్: బాధిత కుటుంబానికి బియ్యం అందజేత
దౌల్తాబాద్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వడ్ల ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ ఉప సర్పంచ్ అందె రాజిరెడ్డి బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లవేళలా సహాయం అందించేందుకు ముందుంటానని తెలిపారు.