పేదరికంతో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటేనే తల్లిదండ్రులకు గుండె భారంగా అవుతుందని నిరుపేద యువతీ వివాహానికి మానవత్వంతో చేయూతనివ్వడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నిరుపేద యువత వివాహానికి బియ్యం అందజేశారు.