నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని పోలీసు కమిషనర్ అనురాధ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా సిద్దిపేట కమిషనర్ ఆవరణలో పోలీసు అధికారులతో కలిసి పోలీసు కమిషనర్ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి మొక్కలే రేపటి వృక్షాలని, ఆహ్లాదకరమైన వాతావరణానికి మొక్కలు చాలా ముఖ్యమన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటాలన్నారు.